పిర్యాదుదారుల సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించాలని మెదక్ జిల్లా పోలీస్ అధికారులకు సూచించిన ఎస్పీ రోహిణి ప్రియదర్శిని

Spread the love
SP.Rohini Priyadarshini

మెదక్ జిల్లా, ప్రతినిధి (సముద్రం న్యూస్):

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మెదక్ జిల్లా ఎస్పీ పి.రోహిణి ప్రియదర్శిని ఫ్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలుసూచనలు చేయడం అయినది. ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండలం యూసఫ్ పేట గ్రామానికి చెందిన వడ్ల సత్యనారాయణ s/o శివ రాములు గారికి గ్రామ శివారులోని 85 సర్వే.నెoలో 36 గుంటల భూమి కలదని అట్టి భూమిలో 15 గుంటల భూమిని సుమారు 12 సంవత్సరాల క్రితం ఎర్పుల కిష్టయ్య s/o రామయ్య గారికి అమ్మినారని, తన ఆరోగ్యం బాగాలేక చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తిరుగుచుండగా అదునుచూసి కిష్టయ్య భూమిని అంతా అక్రమంగా తన పేరు పైకి మార్చుకున్నారని కాని E.C లో మాత్రం 1968 నుండి ఇప్పటివరకి భూమి తన పేరు పైనే చూపిస్తుందని కావున తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని పాపన్నపేట ఎస్.ఐ. గారికి సూచనలు చేయటం జరిగింది. అలాగే సిద్దిపేట పట్టణానికి చెందిన చింతా రాణమ్మ భర్త సంగయ్య గారికి రామాయంపేట మండలం లక్ష్మాపుర్ గ్రామంలో తన తండ్రి నుండి సంక్రమించిన భూమి, సర్వే.నెo 44/5 మరియు 45లో ఎ 1.04 గుంటలు మరియు ఎ.1-16 గుంటల భూమి కాలదని ఇట్టి భూమిని లక్ష్మాపుర్ గ్రామ నివాసులైన 1.సిద్దిరాములు 2.సురేశ్ 3.చంద్రశేఖర్ 4.రుకవ్వ 5.సిద్దయ్య దొంగ దస్తావేజులు సృష్టించి తమ పేరు పైకి పట్టా చేసుకున్నారని వారిని ఎందుకిలా చేశారు అని అడుగగా తనని బెదిరించి భయబ్రాంతులకి గురిచేసారాని,వారితో తన కుటుంబానికి ప్రాణ భయం పొంచివున్నదని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని రామాయంపేట సి.ఐ. గారికి సూచనలు చేయటం జరిగింది. జిల్లా నలుమూలల నుండి పలు ఫిర్యాదుదారులు రావడం జరిగిందన్నారు .

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి