అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

Spread the love

దర్జాగా కొనసాగుతున్న అక్రమ గృహ నిర్మాణం

ఇంటి గుమ్మానికే పరిమితమైన అధికారుల హెచ్చరిక

పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన లెక్క చేయని కబ్జాదారులు

అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూలై 26 జనసముద్రం న్యూస్

అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం, రాయవరం గ్రామపంచాయతీ చీనేవాండ్ల పల్లిలో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాలు నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. గ్రామ కంఠం 831 సర్వే నెంబర్లో కొద్దిమేర విలువైన భూములు ఉన్నాయి. ప్రభుత్వ అవసరాల కోసం గ్రామ కంఠంలోని డీకేటి భూములు ప్రభుత్వం ఎప్పుడైనా ఎలాగైనా వాడుకోవచ్చని చట్టం చెబుతుంది. అయితే గత కొద్దిరోజులుగా ఆక్రమనదారులు శరవేగంగా నిర్మాణ పనులు సాగిస్తున్నారు. అయితే ఊర్లోని గ్రామ ప్రజలు నిర్మాణ సమయంలో ఫిర్యాదు చేసిన లెక్కచేయకుండా రూఫ్ లెవెల్ వరకు పనులు సాగించారు.ఈ విషయంపై గ్రామస్తులు కలెక్టర్ ఫిర్యాదు చేయడంతో అక్రమ నిర్మాణ పనులు నిలుపుదజేయాలని మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే గతవారం పంచాయతీ అధికారులు అక్రమనదారులు ఇంటికి వెళ్లి నోటీసులు జారీచేసిన వారు తిరస్కరించడంతో అధికారులు వారి ఇంటికి గుమ్మానికి నోటీసులు అతికించారు.అయితే గురువారం పంచాయతీ అధికారులను కూడా లెక్క చేయకుండా ఆక్రమణదారులు స్లాబ్ వేసేందుకు సిద్ధమయ్యారు.ఈ విషయం పై పంచాయతీ అధికారులు మీడియా ప్రతినిధులు వివరణ కోరగా ఆక్రమనదారులకు నోటీసులు జారీ చేసిన వారు కట్టడాలు నిలుపుదల చేయలేదని పోలీసు వారికి ఫిర్యాదు చేశామని తెలిపారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమనదారులపై తగు చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో గ్రామంలో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ఆ ఊరి గ్రామస్తులు కోరుతున్నారు. రెవెన్యూ అధికారులు ఉదాసినతోనే గ్రామ కంఠంలోని భూములకు రక్షణ లేకుండా పోతుందని చర్చించుకుంటున్నారు.

  • Related Posts

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు…

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్పల్నాడు జిల్లా ప్రతినిధిజులై 26. పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో మాచర్ల నందు ది.25.07.2025 తేదీ నాడు జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట వారి ఆధ్వర్యంలో రైతు శిక్షణ కేంద్రం నిర్వహించారు. శిక్షణా కార్యక్రమంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం