ఏప్రిల్ నాటికి చైనాలో సుమారు 10 లక్షల మంది కోవిడ్ తో మృతిచెందే అవకాశం..చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించిన ఇండియా,అమెరికా,యూకే..తమపై ఆంక్షలు విధిస్తే ప్రతీకారం తప్పదంటున్న చైనా..!

Spread the love

జనసముద్రం న్యూస్,జనవరి 4:

కరోనా పుట్టినిల్లు చైనాలో మరోసారి కోవిడ్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఒమ్రికాన్.. బీఎఫ్ 7 వేరియంట్ సహా మరో రెండు కొత్త వేరియంట్లు చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీనికి తోడు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆ దేశంలో జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తివేశారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి.

చైనాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సరిగా చేయకపోవడం వల్లే ప్రజలు మళ్లీ కోవిడ్ బారిన పడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏప్రిల్ నాటికి చైనాలో సుమారు 10 లక్షల మంది కోవిడ్ తో మృతిచెందే అవకాశం ఉందని ఇటీవల అమెరికా ఒక నివేదికలో ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అన్ని దేశాలు చైనా పట్ల అప్రమత్తం అవుతున్నాయి.

దీనిలో భాగంగానే చైనా నుంచి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి. చైనాతో సరిహద్దు పంచుకుంటున్న దేశాలతో పాటు ఇతర దేశాలన్ని చైనీయులు తమ దేశంలో అడుగు పెట్టాలంటే తప్పనిసరి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. కొన్ని దేశాలు వారిని క్వారంటైన్ చేస్తున్నాయి. అయితే ఈ నిర్ణయాన్ని చైనా మాత్రం తప్పు పడుతోంది.కొన్ని విదేశీ శక్తులు చైనీయులను కావాలనే బాదానం చేస్తున్నాయని ఆరోపిస్తోంది. ఇందులో కుట్ర కోణం ఉందంటూ పరోక్షంగా అమెరికాపై విమర్శలు గుప్పిస్తోంది. రాజకీయాలకు ప్రేరిపితమే తమ దేశంపై కొన్ని దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయని మండిపడింది. అంతేకాకుండా తమపై ఆంక్షలు విధించే వారిపై ప్రతీకారం తప్పదంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది.

కాగా చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించిన దేశాల్లో ఇండియాతో పాటు అమెరికా.. యూకే దేశాలు ఉన్నాయి. కరోనాను కట్టడి చేసే క్రమంలో ఈ దేశాలు చైనాకు చెందిన విదేశీయులపై ఆంక్షలు విధిస్తున్నట్లు చెబుతున్నాయి. అయితే చైనా మాత్రం మరొలా ఆరోపణలు చేస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ దేశాలు చైనా ఆరోపణలపై ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.     

Related Posts

మాచర్లలో అత్యంత వైభవంగా జరుగుతున్నబతకమ్మ ఉత్సవాలు.

Spread the love

Spread the love మాచర్ల జన సముద్రం న్యూస్ అక్టోబర్ 06.దసరా శరన్న వ రాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని మాచర్ల పట్టణంలో పలు దేవాలయాల్లో బతకమ్మ ఉత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక శ్రీ కోదండరామ దేవాలయంలో, శ్రీ వాసవి…

జంపేట పరిధిలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

Spread the love

Spread the love ఏడు ఎర్రచందనం దుంగలతో పాటు 2మోటారు సైకిళ్లు స్వాధీనం అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జూలై 23 జనసముద్రం న్యూస్: అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని కావలిపల్లి రాయవరం సెక్షన్ వద్ద మామిడి తోటలో 7ఎర్రచందనం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం