ఆన్లైన్ యాప్ లో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా నష్టపోవద్దు*

Spread the love

అప్పులు తెచ్చి ఆర్థిక సమస్యల్లో కోరుకుపోవద్దు

ఆన్లైన్ మోసాలపై మండల ప్రజలు తగిన జాగ్రత్త వహించాలి .ఎస్సై ప్రవీణ్ కుమార్

మునగాల ప్రతినిధి, జనసముద్రం న్యూస్ అక్టోబర్ 26

సామాజిక మాధ్యమాల వేదికగా విపరీతంగా పుట్టుకొస్తున్న ఆన్ లైన్ యాప్ లో ఆర్థికంగా పెట్టుబడులు పెడితే తిరిగి రెట్టింపు నగదు వస్తుందని అపోహలని మండల ప్రజలు ఎవరు నమ్మి మోసపోవద్దని మునగాల ఎస్ఐ బి ప్రవీణ్ కుమార్ అన్నారు, శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ, మండలంలో ఈ మధ్యకాలంలో ఆర్జిఏ యాప్ పేరుతో ప్రజలు పెద్ద ఎత్తున సమూహంగా ఒకరి నుండి మరొకరు అత్యాశకు పోయి వేల రూపాయలు అప్పులు తీసుకువచ్చి ఆర్థికంగా పెట్టుబడులు పెట్టారని తీరా చూస్తే రెండు రోజుల క్రితం ఆర్జిఏ యాప్ సంస్థ ఎత్తివేయడంతో మండల ప్రజలు గగ్గులు పెడుతున్న పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తుందని, కావున నేటి ప్రస్తుత పరిస్థితుల శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకునే అనేక సోషల్ మీడియా యాప్ లు నడుపుతున్న సంస్థలు ప్రజల్ని మోసం చేసేందుకు రకరకాల పద్ధతుల్లో ప్రయత్నిస్తుంటారని, మండల ప్రజలు తగిన జాగ్రత్త చర్యలతో అత్యాశకు పోయి సోషల్ మీడియా వేదికగా వచ్చే ఆన్లైన్ యాప్ ల నందు ఎలాంటి పెట్టుబడులు పెట్టడం గాని లేదా ఇతర ఆర్థిక లావాదేవీలు కొనసాగించడం కానీ చేయవద్దని వారన్నారు, ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఇలాంటి యాపుల్లో చేరాలని ప్రచారం చేసిన ఒత్తిడి తెచ్చిన వారి వివరాలని స్థానిక పోలీసులకు అందించాలని , అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వారన్నారు. ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఇలాంటి ఆన్లైన్ యాప్ లో పెట్టుబడి పెట్టి సంస్థలు బోర్డులు తిప్పేసిన తర్వాత తీవ్రంగా నష్టపోయి ప్రజలు ఆర్థిక సమస్యల్లో కోరుకపోవద్దని వారు సూచించారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్