గుండెపోటుతో 12 ఏళ్ల విద్యార్థి మృతి..స్కూల్ బస్ లో స్ట్రోక్..హాస్పిటల్ కు తీసుకెల్లే లోపు విషాదం

Spread the love
 అజీర్ణం కాకుంటే గుండెపోటును ఎలా గుర్తించాలి?,[object Object],గుండెపోటు ,అజీర్ణం మధ్య లక్షణాలలో సారూప్యతలు ఉన్నప్పటికీ వాటిని వేరుగా చెప్పడంలో మీకు సహాయపడే కొన్ని తేడాలు కూడా ఉన్నాయి.,[object Object],గుండెపోటు సాధారణ సంకేతాలలో కొన్ని:,[object Object],- శ్వాస ఆడకపోవుట,[object Object],- చల్లని చెమటలు లేదా ఆందోళన,[object Object],- ఛాతీ నొప్పి ఆకస్మికంగా, తీవ్రంగా ఉంటుంది,[object Object],- యాంటాసిడ్‌లు తీసుకున్న తర్వాత కూడా లక్షణాలు కొనసాగడం
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 17:

కరోనాకు ముందు నాటికి తర్వాతి నాటికి తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. కరోనాకు ముందు ఎప్పుడూ వినని.. చూడని ఎన్నో ఉదంతాలు కరోనా తర్వాత చూస్తున్న పరిస్థితి. అప్పటివరకు బాగానే ఉండి.. హుషారుగా నలుగురి మధ్యలో ఉండి కేరింతలు కొట్టే వారు హటాత్తుగా కుప్పకూలిపోవటం.. ఆ వెంటనే ప్రాణాలు విడుస్తున్న విచిత్రమైన ఉదంతాలు ఇటీవల చోటు చేసుకుంటున్నాయి. అయితే.. ఇలాంటి ఉదంతాలు మధ్య వయస్కులే ఎక్కువగా విన్నాం. చూశాం. అందులో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలానే బాధితులు ఉన్నారు.

ఇందుకు భిన్నంగా మధ్య ప్రదేశ్ లో తాజాగా చోటు చేసుకున్న ఉదంతం గురించి వింటే భయంతో వణికిపోతాం. ఎందుకిలా? జరిగి ఉంటుందన్న షాక్ నుంచి ఒక పట్టాన బయటకు రాలేని పరిస్థితి. అంతటి షాకింగ్ ఉదంతంగా దీన్ని చెప్పాలి. మధ్యప్రదేశ్ కు చెందిన పన్నెండేళ్ల పిల్లాడు స్కూల్ బస్సులో ఇంటికి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవటం.. ఆ వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళితే.. కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారన్న విషయం గురించి తెలిసిన వారు నోటి వెంట మాట రాలేని రీతిలో ఉండిపోతున్నారు.
మధ్యప్రదేశ్ లోని బింద్ జిల్లాలోని ఒక స్కూల్లో మనీశ్ జాటవ్ అనే పన్నెండేళ్ల పిల్లాడు నాలుగో తరగతి చదువుతన్నారు. గురువారం తన సోదరుడితో కలిసి లంచ్ అవర్ లో భోజనం చేవాడు. ఆ తర్వాత 2 గంటలకు స్కూల్ పూర్తి అయ్యాక.. ఇంటికి వెళ్లేందుకు స్కూల్ బస్సు ఎక్కాడు. తన తోటి మిత్రులతో సరదాగా ఉంటూ కేరింతలు కొట్టాడు. కాసేపటికే ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో పిల్లాడి గురించి స్కూల్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చిన బస్సు డ్రైవర్.. వెంటనే అక్కడికి దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే ఆ విద్యార్థి ప్రాణాలతో లేడన్న షాకింగ్ నిజాన్ని వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రికి వచ్చేసరికే ప్రాణాలతో లేడని.. సీపీఆర్ చేసినా కూడా కాపాడలేకపోయినట్లుగా పేర్కొన్నారు. పిల్లాడి మరణానికి కారణం ఏమై ఉంటుందన్న విషయానికి వస్తే.. తాము చూస్తున్న ప్రాథమిక లక్షణాల్ని చూస్తే.. సదరు పిల్లాడు కార్డియాక్ అరెస్ట్ కు గురైనట్లుగా భావిస్తున్నట్లుగా వెల్లడించారు.
అయితే.. ఇంత చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రం మొత్తంలో ఇదే మొదటిది అవుతుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. తమ కొడుక్కి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని మనీశ్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతూ విలపిస్తున్నారు. మారిన కాలానికి తగ్గట్లు.. మరణాల్ని అంచనా వేయటం చాలా కష్టంగా మారిందన్న దానికి నిదర్శనంగా ఈ ఉదంతం ఉందని చెప్పక తప్పదు.

  • Related Posts

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు…

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    Spread the love

    Spread the love దర్జాగా కొనసాగుతున్న అక్రమ గృహ నిర్మాణం ఇంటి గుమ్మానికే పరిమితమైన అధికారుల హెచ్చరిక పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన లెక్క చేయని కబ్జాదారులు అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూలై 26 జనసముద్రం న్యూస్ అన్నమయ్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం