వైసీపీ ఓడిపోతే నష్టపోయేది పేద ప్రజలే..ఇది పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం అంటున్న సీఎం జగన్..!

Spread the love
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 17:

రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లోనూ అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ వ్యూహాన్ని మరింత వేగం పెంచేందుకు జగన్ అనేక రూపాల్లో ప్రయ త్నాలు చేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. రాష్ట్రంలో పేదలకు పెత్తందా ర్లకు మధ్య యుద్ధం జరుగుతోందని ఈ యుద్ధంలో వైసీపీ ఓడిపోతే.. నష్టపోయేది పేదలేనని ఆయన వ్యాఖ్యానించారు.

నిజానికి పేదలు.. ఉన్నారు సరే!  మరి పెత్తం దార్లు ఎవరు?  టీడీపీ జనసేన బీజేపీలేనా?  ఈ జాబితాలో వైసీపీ రాదా? అనేది ప్రధాన ప్రశ్న అత్యంత ధనిక పార్టీల్లో వైసీపీ కూడా ఉందని ఇటీవల ఓ సంస్థ వెల్లడించిన జాబితానే ఉంది. దీనిని బట్టి వైసీపీ కూడా పెత్తందారు పార్టీ కాదా? అనేది సగటు పౌరుడి ప్రధాన ప్రశ్న. పేదల కోసమే ఈ పార్టీ ఉందని అనుకుంటే.. రాష్ట్రంలో ఉన్న పేదల తలరాతలు మార్చేందుకు ఈ మూడున్నరేళ్లలో చేసింది ఏంటి? అనేది మరో కీలక సందేహం.
ఎందుకంటే.. కేవలం డబ్బులు పంచుకుంటూ పోయినా.. వారి జీవితాల్లో మెరుగు కనిపించాలి.. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం చూసుకుంటే.. 4 లక్షల కోట్ల రూపాయలను పేదలకు పంచారు. మరి వారి జీవితాల్లో మార్పు కనిపించిందా?  వారు సంపన్నుల జాబితాలోకి కాకపోయినా.. మధ్యతరగతి జాబితాలోకి అయినా .. వచ్చారా? అనేది ప్రశ్న. కానీ లేదు.
పోనీ.. తమది పేదల పార్టీఅనుకుంటే.. ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంపీ వ్యాపార వ్యవహరాలు..ఆస్తులు బహిర్గతం చేసి.. తమది పేదల పార్టీ అని చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారా? అంటే అది కూడా లేదు. మొత్తం గా చూస్తే.. కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు మాత్రమే చేస్తున్న ప్రయత్నంగా ఉంది తప్ప..  ఇది ఆచరణలోనూ.. వినేందుకు కూడా ఇబ్బందిగానే ఉందని అంటున్నారు పరిశీలకులు.

  • Related Posts

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు…

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    Spread the love

    Spread the love దర్జాగా కొనసాగుతున్న అక్రమ గృహ నిర్మాణం ఇంటి గుమ్మానికే పరిమితమైన అధికారుల హెచ్చరిక పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన లెక్క చేయని కబ్జాదారులు అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూలై 26 జనసముద్రం న్యూస్ అన్నమయ్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం