గుండెపోటుతో 12 ఏళ్ల విద్యార్థి మృతి..స్కూల్ బస్ లో స్ట్రోక్..హాస్పిటల్ కు తీసుకెల్లే లోపు విషాదం

Spread the love
 అజీర్ణం కాకుంటే గుండెపోటును ఎలా గుర్తించాలి?,[object Object],గుండెపోటు ,అజీర్ణం మధ్య లక్షణాలలో సారూప్యతలు ఉన్నప్పటికీ వాటిని వేరుగా చెప్పడంలో మీకు సహాయపడే కొన్ని తేడాలు కూడా ఉన్నాయి.,[object Object],గుండెపోటు సాధారణ సంకేతాలలో కొన్ని:,[object Object],- శ్వాస ఆడకపోవుట,[object Object],- చల్లని చెమటలు లేదా ఆందోళన,[object Object],- ఛాతీ నొప్పి ఆకస్మికంగా, తీవ్రంగా ఉంటుంది,[object Object],- యాంటాసిడ్‌లు తీసుకున్న తర్వాత కూడా లక్షణాలు కొనసాగడం
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 17:

కరోనాకు ముందు నాటికి తర్వాతి నాటికి తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. కరోనాకు ముందు ఎప్పుడూ వినని.. చూడని ఎన్నో ఉదంతాలు కరోనా తర్వాత చూస్తున్న పరిస్థితి. అప్పటివరకు బాగానే ఉండి.. హుషారుగా నలుగురి మధ్యలో ఉండి కేరింతలు కొట్టే వారు హటాత్తుగా కుప్పకూలిపోవటం.. ఆ వెంటనే ప్రాణాలు విడుస్తున్న విచిత్రమైన ఉదంతాలు ఇటీవల చోటు చేసుకుంటున్నాయి. అయితే.. ఇలాంటి ఉదంతాలు మధ్య వయస్కులే ఎక్కువగా విన్నాం. చూశాం. అందులో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలానే బాధితులు ఉన్నారు.

ఇందుకు భిన్నంగా మధ్య ప్రదేశ్ లో తాజాగా చోటు చేసుకున్న ఉదంతం గురించి వింటే భయంతో వణికిపోతాం. ఎందుకిలా? జరిగి ఉంటుందన్న షాక్ నుంచి ఒక పట్టాన బయటకు రాలేని పరిస్థితి. అంతటి షాకింగ్ ఉదంతంగా దీన్ని చెప్పాలి. మధ్యప్రదేశ్ కు చెందిన పన్నెండేళ్ల పిల్లాడు స్కూల్ బస్సులో ఇంటికి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవటం.. ఆ వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళితే.. కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారన్న విషయం గురించి తెలిసిన వారు నోటి వెంట మాట రాలేని రీతిలో ఉండిపోతున్నారు.
మధ్యప్రదేశ్ లోని బింద్ జిల్లాలోని ఒక స్కూల్లో మనీశ్ జాటవ్ అనే పన్నెండేళ్ల పిల్లాడు నాలుగో తరగతి చదువుతన్నారు. గురువారం తన సోదరుడితో కలిసి లంచ్ అవర్ లో భోజనం చేవాడు. ఆ తర్వాత 2 గంటలకు స్కూల్ పూర్తి అయ్యాక.. ఇంటికి వెళ్లేందుకు స్కూల్ బస్సు ఎక్కాడు. తన తోటి మిత్రులతో సరదాగా ఉంటూ కేరింతలు కొట్టాడు. కాసేపటికే ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో పిల్లాడి గురించి స్కూల్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చిన బస్సు డ్రైవర్.. వెంటనే అక్కడికి దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే ఆ విద్యార్థి ప్రాణాలతో లేడన్న షాకింగ్ నిజాన్ని వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రికి వచ్చేసరికే ప్రాణాలతో లేడని.. సీపీఆర్ చేసినా కూడా కాపాడలేకపోయినట్లుగా పేర్కొన్నారు. పిల్లాడి మరణానికి కారణం ఏమై ఉంటుందన్న విషయానికి వస్తే.. తాము చూస్తున్న ప్రాథమిక లక్షణాల్ని చూస్తే.. సదరు పిల్లాడు కార్డియాక్ అరెస్ట్ కు గురైనట్లుగా భావిస్తున్నట్లుగా వెల్లడించారు.
అయితే.. ఇంత చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రం మొత్తంలో ఇదే మొదటిది అవుతుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. తమ కొడుక్కి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని మనీశ్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతూ విలపిస్తున్నారు. మారిన కాలానికి తగ్గట్లు.. మరణాల్ని అంచనా వేయటం చాలా కష్టంగా మారిందన్న దానికి నిదర్శనంగా ఈ ఉదంతం ఉందని చెప్పక తప్పదు.

  • Related Posts

    భర్త లేని లోకంలో ఉండలేను

    Spread the love

    Spread the love రెండేళ్ల కుమారుడికి ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్న వివాహిత మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో భార్య అఖిల(25), కొడుకు శ్రియాన్ గౌడ్(2) తో కలిసి నివసిస్తూ, కూలి పనులు చేస్తూ జీవనం సాగించిన…

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    Spread the love

    Spread the love రాజపేట గురుకుల కళాశాలలో ఆరుగురు పదవ తరగతి విద్యార్థులపై ఇంటర్ విద్యార్థుల దాడి క్రికెట్ బ్యాట్లతో దాడి చేయడంతో విద్యార్థులకు తీవ్ర గాయాలు ర్యాగింగ్ ఘటన బయటకు రాకుండా లోలోపల ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేసిన హాస్టల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!