జనసముద్రం న్యూస్ అమరావతి (బ్యూరో) జూన్ 7.
ఏపీలో బక్రీద్ సందర్భంగా ఎవరైనా ఆవులు, దూడలు, ఒంటెలను వధిస్తే జంతువుల సంరక్షణ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయడు హెచ్చరించారు. రాష్ట్రంలో జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టాల ప్రకారం వధపై నిషేధం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు జంతు వధ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. చట్టాలను గౌరవించి స్వచ్ఛందంగా వధను నిషేధించాలని ఆయన కోరారు





