65 సంవత్సరాల పైబడిన వారికి, మరియు దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్ పంపిణీ….
65 సంవత్సరాల వయసు పైబడిన మరియు వికలాంగుల కార్డులలో 03 రోజులలోనే 57.79 శాతం కార్డులకు రేషన్ సరుకుల పంపిణీ….
….జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
రాయచోటి, జన సముద్రం న్యూస్ జూన్ 04:
65 సంవత్సరాల పైబడిన వారికి, మరియు దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్ పంపిణీ జరుగుతుందని, వారు రేషన్ షాపుల వద్దకు రావాల్సిన అవసరం లేదని అన్నమయ్య జిల్లాలో జూన్ మాసం మొదటి 03 రోజులలోనే వికలాంగులు మరియు 65 సంవత్సరాల పైబడిన వారి మొత్తం కార్డులలో 57.79 శాతం కార్డులకు రేషన్ సరుకుల పంపిణీ పూర్తయిందన్నారు.
మంగళవారం సాయంత్రం అన్నమయ్య జిల్లాలో చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ పై పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ….. అన్నమయ్య జిల్లాలో మొత్తం 1123 చౌక ధరల దుకాణాలు ఉన్నాయని, మొత్తం రేషన్ కార్డులు 4,97,969 ఉన్నాయని, మొత్తం రేషన్ కార్డుల ద్వారా 14,82,094 మంది సభ్యులు రేషన్ ద్వారా లబ్ది పొందనున్నారని పేర్కొన్నారు. ఇందులో 65 సంవత్సరాల పైబడిన కార్డుల సంఖ్య 53,707 గా ఉందని, ఈ కార్డుల ద్వారా 69,336 మంది సభ్యులు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. ప్రతినెల 01 నుండి 15 తారీకు వరకు ఉదయం 08 నుండి 12 గంటల వరకు సాయంత్రం 04 నుండి 08 గంటల వరకు రేషన్ పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. ఏక లేదా ద్విసభ్య కార్డులలోని వారి వయస్సు 65 సంవత్సరాల పైబడి వారికి, దివ్యాంగులకు వారి ఇంటి వద్దనే రేషన్ పంపిణీ ఒకటో తేది నుండి 05 వతేది వరకు 12 గంటల నుండి 4 గంటల మద్య సమయములో పంపిణి చేయబడుతుందన్నారు.
వృద్ధులు మరియు దివ్యాంగులు రేషన్ షాపులకు రావలసిన అవసరం లేదు…..
65 సంవత్సరాల పైబడిన వృద్ధులు మరియు దివ్యాంగుల ఉద్దేశించి మాట్లాడుతూ వీరెవ్వరు రేషన్ షాపులకు రావాల్సిన అవసరం లేదని రేషన్ డీలర్ వారి ఇంటి వద్దకు రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేస్తారని పేర్కొన్నారు. వృద్ధులకు మరియు దివ్యాంగులకు ప్రతి నెల మొదటి 05 రోజుల లోపే రేషన్ సరుకుల పంపిణీ పూర్తి కానుందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రఘురాం, తదితరులు పాల్గొన్నారు.





