మలక్ పేట వివాహిత మృతి కేసులో ట్విస్ట్.

Spread the love

హైదరాబాద్‌లోని మలక్‌పేటలో వివాహిత శిరీష మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మొదట గుండెపోటుతో మరణించినట్లు భావించినప్పటికీ, పోస్టుమార్టం నివేదికలో ఆమె ఊపిరాడకుండా హత్యకు గురైనట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని మృతురాలి కుటుంబసభ్యులకు పోలీసులు తెలియజేశారు. దీంతో శిరీష భర్త వినయ్‌ హత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు వినయ్‌తో పాటు అతని ఇద్దరు అక్కలను ఉస్మానియా ఆసుపత్రి వద్ద అదుపులోకి తీసుకున్నారు.

కరీంనగర్ జిల్లా పరకాలకు చెందిన విజయలక్ష్మి చిన్న కుమార్తె శిరీష (32)కు, నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటకు చెందిన వినయ్‌తో ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ప్రిన్సి అనే ఆరేళ్ల కుమార్తె ఉంది. ప్రస్తుతం వీరు మలక్‌పేటలోని జమునా టవర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి శిరీష ఛాతిలో నొప్పి వచ్చిందని చెప్పి, భర్త వినయ్ ఆమెను సమీపంలోని మెట్రో క్యూర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటనే ఈ విషయాన్ని శిరీష కుటుంబసభ్యులకు సమాచారం అందించగా, భౌతికకాయాన్ని స్వగ్రామం దోమలపెంటకు తరలించేందుకు వినయ్‌ ఏర్పాట్లు చేశాడు.

ఈ సమాచారం అందుకున్న శిరీష మేనమామ మధుకర్, వినయ్‌కు కాల్ చేసి మృతదేహాన్ని ఆసుపత్రిలోనే ఉంచాలని సూచించారు. కానీ వినయ్‌ ఈ మాటను పట్టించుకోకుండా అంబులెన్స్‌లో శిరీషను స్వగ్రామానికి తరలించేందుకు బయల్దేరాడు. అసహనానికి గురైన మేనమామ మధుకర్, అంబులెన్స్‌ డ్రైవర్‌ను గుర్తించి, అతనికి ఫోన్‌ చేశాడు. పరిస్థితి అనుమానాస్పదంగా మారడంతో అంబులెన్స్‌ డ్రైవర్‌ ఈ విషయాన్ని చాదర్‌ఘాట్‌ పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు వెంటనే అంబులెన్స్‌ను వెనక్కి రప్పించారు.

శిరీష కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు, పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనంతరం పోస్టుమార్టం నివేదికలో ఊపిరాడకుండా హత్యచేసినట్లు తేలడంతో, వినయ్‌తో పాటు అతని ఇద్దరు అక్కలను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు. శిరీషను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఇది వినయ్, అతడి కుటుంబ సభ్యుల పనియేనా? దీన్ని సహజ మరణంగా ఎందుక చిత్రీకరించారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని విషయాలు విచారణలో బయటపడనున్నాయి.

  • Related Posts

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు…

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    Spread the love

    Spread the love జనసముద్రం న్యూస్, మదనపల్లి, జులై 26:- మదనపల్లె టమోటా మార్కెట్లో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం చెందాడు. ఇందుకు సంబంధించి 2టౌన్ పోలీసుల కథనం ప్రకారం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కాశిగంజ్ జిల్లా, నంగులా తానాకు చెందిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం