జన సముద్రం న్యూస్, ఆగస్టు 22 (భద్రాచలం):
భద్రాచలంలోని కూనవరం రోడ్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా రహదారిపై గుంత ఏర్పడింది. ఈ మార్గం మీదుగా పలు వాహనాలు వెళ్తుంటాయి. వాహనదారులు రహదారిపై ఏర్పడిన గుంతను గమనించకపోతే వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రమాదాలు జరిగే సమయంలో ఈ ప్రాంతంలో విద్యార్థులు ఉంటే వారు కూడా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అలాగే రాత్రి సమయంలో వాహనదారులు ఈ గుంతను గమనించకపోతే ప్రమాదాలబారిన పడే అవకాశం అధికంగా ఉంది. సంబంధిత అధికారులు రహదారిపై ఏర్పడిన గుంతను పూడ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.





