
యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు.21,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:
జనసముద్రం న్యూస్ భువనగిరిలోని రూరల్ పోలీస్ క్వార్టర్స్ లో బుధవారం రోజున కానిస్టేబుల్ మెట్టు మధుసూదన్ రెడ్డి భార్య విజయలక్ష్మి (35) ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.మధుసూదన్ రూరల్ పోలీస్ స్టేషన్లో రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు.ఆయన లంచ్ చేయడానికి ఇంటికి వెళ్లగా విజయలక్ష్మి విగతజీవిగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.ఫ్యానుకు వేలాడుతున్న మృతదేహాన్ని పోలీసులు కిందకు దించారు.