ఉదయం ఉక్కపోత.
సాయంత్రం వేళల్లో ఉరుములు, ఈదురు గాలులు.
జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 5 జూన్
తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు, వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది.
ఉమ్మడి కరీంనగర్ (కరీంనగర్, జగిత్యాల,సిరిసిల్ల,పెద్దపల్లి) ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ నుండి హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఉపరితల గాలులు వాయువ్యదిషగా వీచే అవకాశం ఉంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉదయం పూట ఉష్ణోగ్రతలు పెరిగి ఉక్కపోతతో జనాలు అతలాకుతంలో ఉంటున్నారు.
బయటకి రాలేని పరిస్థితి నెలకొంది.
సాయంత్రం అయ్యేసరికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన పరిస్థితి నెలకొంది.
ఆయా జిల్లాలోని ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, తగువిధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేక వాతావరణ బులిటెన్ సూచనలు చేసింది.





