పొగాకు వాడకం, సిగరెట్లు, బీడీలు నిషేధం అమలులో ఉండాలి.
ఏసీపి పై ఆశలు పెట్టుకున్న ప్రజలు.
జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 31 మే
హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండల కేంద్రంలలో మరియు ఆయా మండలాలలోని పలు గ్రామాలల్లో విచ్చలవిడిగా దుకాణం షాపులలో గుట్టు చప్పుడు కాకుండా గుట్కా, పొగాకు వాడకం, సిగరెట్లు, బీడీలు వ్యాపారం కొనసాగుతున్నట్లు సమాచారం.
ప్రభుత్వం ఇటీవలే గుట్కా నిషేధం పై ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే.
యువత మత్తుకు బానిస అవుతుంది.
ఆరోగ్యాన్ని, భవిష్యత్తుని కాపాడుకోలేక పోతున్నారు.
పాన్, గుట్కా, పొగాకు వాడకం, సిగరెట్లు, బీడీలు తదితర మత్తు పదార్థాలు నిషేధించాలనే ఉత్తర్వులు క్షేత్రస్థాయి లో అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
రోడ్లమీద, వీధులలో విచ్చలవిడిగా సిగరెట్లు, బీడీలు తాగడం గమనార్హం.
హుజురాబాద్ నూతన ఎసిపి శ్రీనివాస్ జీ ఆయా మండలాల వారీగా కిరాణం షాపులలో తనిఖీలు, పర్యవేక్షణలు నిర్వహించాలి. గుట్కా అమ్మే షాపులపై ప్రత్యేక నజర్ (చొరవ) తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ఆయా కిరాణం షాపులలో రాత్రి వేళల్లో గుట్కా వ్యాపారం విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉంటుంది.
పట్టించుకొనే నాధులు, అధికారులు లేరని ప్రజలు వాపోతున్నారు.
గ్రామాలలో పోలీస్ విజిల్ వినబడక పోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది.
పోలీస్ శాఖ తో పాటుగా, అబ్కారీ శాఖ, విజిలెన్స్ అధికారులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది గ్రామాలలో సంచరిస్తే పూర్తి స్థాయిలో గుట్కా, పొగాకు వాడకం సిగరెట్లు, బీడీలు నిషేధం అమలులో ఉంటుందని యువత, తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు, యువజన సంఘం నాయకులు, ప్రజా సంఘాలు, మేధావి వర్గాలు, నాయకులు కోరుతున్నారు.





