మహబూబాబాద్, జనసముద్రం న్యూస్ ప్రతినిధి బుధవారం 29 మే
:గంగారం మండలం గంగారం గ్రామం లోని జెజ్జరివారి గుంపు నుండి గుడిపాడు చివర వరకు గల రోడ్డు దాదాపు 1కిలో మీటరు రోడ్డు కు ఏడాది క్రితం తారు రోడ్డు మంజూరు అయ్యింది ఈ రోడ్డు కు సదరు కాంట్రాక్టర్ ఏడాది క్రితం కంకర పోశాడు కానీ ఇప్పటి వరకు తారు వేయలేదు ఇట్టి రోడ్డు పై బస్సులు ఆటోలు నిత్యం తిరుగుతుండగా రోడ్డు మీద నుండి వచ్చే దుమ్ము కు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అలాగే కంకర పోసి వదిలివేయడం వలన కంకర మీద బైక్లు స్కిడ్ అయ్యి పడ్డ సందర్భాలు లేకపోలేదు కంకర మీద ప్రజలు నడవడం కూడా చాలా ఇబ్బంది గా ఉంది కాబటి సదరు కాంట్రాక్టర్ యిప్పటికైన స్పందించి జెజ్జరివారీ గుంపు నుండి గుదిపాడు వరకు వేయవలిసిన రోడ్డు ను పూర్తి చేయాలని జెజ్జరివారీగుంపు వారు గంగారం మాజీ సర్పంచి జెజ్జరీ సమ్మయ్య గారు కన్నయ్య ముత్తయ్య జేజ్జారీ రాము యూత్ సభ్యులు గణేష్ సురేందర్ సిద్దబోయినా సమ్మయ్య లక్మయ్య రామకృష్ణ ఇంక తదితరులు రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు






