యాదాద్రి భువనగిరి జిల్లా మే.21,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:
జనసముద్రం న్యూస్ భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.ప్రతి ఒక్కరూ రవాణా శాఖ నియమ నిబంధనలకు అనుగుణంగా వాహనాలకు సరైన నెంబర్ ప్లేట్లను బిగించుకోవాలన్నారు.నెంబర్ ప్లేట్ లేని వాహనాలతో నేరాలు జరుగుతున్నాయి అన్నారు.నేరాల నియంత్రణకు ప్రతి ఒక్క వాహనదారులు సహకరిస్తూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని ట్రాఫిక్ ఎస్ఐ వెంకటేష్ కోరారు.





