మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్, మార్చి.30
బి.ఎం.హెచ్.ఓ మాట్లాడుతూ, వడదెబ్బ లక్షణాలు ముఖ్యంగా తీవ్రమైన తలనొప్పి, నాడి వేగంగా కొట్టుకోవడం,శరీరంలో నీటిని కోల్పోవడం,పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితిలోకి వెళ్లడం జరగవచ్చని,తీవ్రమైన వడగాల్పులు వీచినప్పుడు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, పొలం పనులు వెళ్లేవారు ఉదయం 6 గంటల నుండి 11 గంటల లోపే వెళ్లి రావాలని,తప్పకుండా అందరూ, రుమాల్ గాని, టోపిని, గొడుగు గాని వెంట తీసుకెళ్లాలని, తెల్లని నూలు వస్త్రాలు ధరించాలని ధరించాలని, ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు బయట తిరగకూడదని, నీరు మరి ఇతర ద్రవపదార్థాలు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలని, వడదెబ్బకు గురి అయిన వ్యక్తిని త్వరగా నీడ గల ప్రదేశాన్ని తీసుకెళ్లాలని శరీరాన్ని చల్లని నీటిలో ముంచిన గుడ్డతో తుడవాలని వడదెబ్బ తగిలిన వారికి ఉప్పు, మజ్జిగ, కొబ్బరినీళ్ల, గ్లూకోజ్ మరియు ఇతర లవణాలు ఓఆర్ఎస్ కలిపిన నీటిని త్రాగించాలని ప్రధమ చికిత్స చేసి వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరడం జరిగింది. అత్యవసర సేవలకై 108 వాహనాన్ని ఉపయోగించుకోవాలని, వైద్య సిబ్బంది ప్రజలందరికీ అవగాహన కల్పించాలని తెలిపారు.
డిప్యూటీ డిఎంహెచ్వో లు,ప్రోగ్రాం ఆఫీసర్స్, మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ తో ఆఫీసర్ తో హీట్ వేవ్ గురించి గురించి జూమ్ మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎమ్ హెచ్ ఓ,డాక్టర్ అంబరీష్, ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ శ్రవణ్ కుమార్, కె. వి రాజు ,పాల్గొన్నారు.





