జనసముద్రం న్యూస్,అనంతపురం జిల్లా,మార్చి29:
మీరు తెలుగుదేశం పార్టీలోకి రావాలి. లేదంటే మీరు ఈ కాలనీలో ఉండలేరు. ఇది పరిటాల సునీత వాళ్ళ స్థలం అంటూ తమను బెదిరిస్తున్నారు అని కనగానపల్లి మండలం నరసంపల్లి గ్రామ మహిళ అనసూయ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎదుట వాపోయింది. మా ఆయనను మార్చేశారు. మొన్న మీ ప్రచారానికి నేను రావాలనుకున్నా. మా ఆయన ఇంట్లో గడి పెట్టాడు. ఇద్దరం గొడవపడ్డాం. మాకు అన్ని పథకాలు అందాయన్నా. మాకు ఫ్రీ బోర్ వేశారు, ఇల్లు వచ్చింది, అమ్మ ఒడి డబ్బులు వచ్చాయి, చాలా పథకాలు వచ్చాయి అన్నా. మా ఆయనను ఫుల్లుగా తాపి ఆక్రమంగా మమ్మల్ని మార్చాలని చూశారు అన్నా. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మీ తోడు కావాలి అన్నా. జీవితకాలం మేము మీతోనే ఉంటాము అన్నా. మేము ఎవరికీ భయపడం జై జగన్… జై ప్రకాష్ రెడ్డి అన్నా… ఎమ్మెల్యే మాట్లాడుతూ నువ్వు ఎవరికి భయపడాల్సిన పనిలేదమ్మా. ఇక్కడ ఎమ్మెల్యేగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉన్నారు. నిన్ను ఎవరూ టచ్ కూడా చేయలేరు.అని ఎమ్మెల్యేగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హమిఇచ్చారు





