జనసముద్రం మార్చి 28 స్టాప్ రిపోర్టర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా.
ఎల్బీనగర్ మన్సురాబాద్ జడ్జిస్ కాలనీ ఫేస్ వన్ లోని శివాలయంలోని గోశాలలో ఉన్న ఆవులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని గో ప్రేమికులు కోరుతున్నారు.
రాజధాని నగరంలో జడ్జిస్ కాలనీలో ఉన్న గోశాల లో గోవులను చంపి కొన్ని ఆవులను తీసుకువెళ్లడం తో ఇంతటి అమానుష సంఘటన జరగడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని .
భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని గోమాతను తల్లిగా భావించి పూజించే ప్రజలు కోరుతున్నారు.





