రాజుల మధ్యే పోటీనా

Spread the love
Is there a secret understanding between Jana Sena TDP

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేటలో రెండు పార్టీల నుండి క్షత్రియులు టికెట్ కోసం తీవ్ర స్థాయిలో పోటీపడుతున్నారు. పోయిన ఎన్నికల్లోనే టీడీపీ తరపున పోటీచేయటానికి జగన్మోహన్ రాజు గట్టి ప్రయత్నాలే చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో మిస్సయిపోయింది. అప్పటినుండి నియోజకవర్గంలోనే పార్టీ బలోపేతానికి కష్టపడుతూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో సడెన్ గా జనసేన నుండి పోటీ మొదలైంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

రెండు పార్టీలు కలిస్తే ఎవరు పోటీ చేసినా గెలుపు గ్యారంటీ అనే ప్రచారం పెరిగిపోవడంతో రెండు పార్టీల తరఫున నేతల ప్రయత్నాల జోరు పెరిగిపోయింది. టీడీపీ తరపున జగన్మోహన్ రాజు ప్రయత్నిస్తుంటే జనసేన తరపున శ్రీనివాసరాజు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. టీడీపీ తరపున మాజీ ఎంఎల్సీ చెంగల్రాయుడు కూడా రేసులో ఉన్నారు. ఇదే సమయంలో జనసేన నుండి శ్రీనివాసరాజు, అతికారి దినేష్ కూడా పోటీలో ఉన్నారు.

రెండు పార్టీల్లోని పరిస్ధితులను బేరీజు వేస్తే రాజుల మధ్య టికెట్ పోటీ బాగా ఉండేట్లుగా అర్ధమవుతోంది. రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాల్లో రాజుల ప్రభావం బాగానే ఉంది. ఏ నియోజకవర్గంలో క్షత్రియులకు టికెట్ ఇచ్చినా దాని ప్రభావం మిగిలిన నియోజకవర్గాలపైనా పడుతుందనే ప్రచారం పెరిగిపోతోంది. అందుకనే ముఖ్యంగా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంపైనే రాజులు గురిపెట్టారు. ఇదే విషయాన్ని గతంలోనే చంద్రబాబునాయుడుతో జగన్మోహన్ రాజు భేటీ అయినపుడు గెలుపు అవకాశాలను వివరించారు. అయితే ఇప్పటి తాజా రాజకీయ పరిణామాల మధ్య ఈక్వేషన్లన్నీ మారిపోయే అవకాశాలు కనబడుతున్నాయి.

మారిపోతున్న పరిణామాలు ఎవరికి అడ్వాంటేజ్ గా మారుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. అయినా సరే రెండుపార్టీల తరపున క్షత్రియనేతలు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పై మూడు నియోజకవర్గాల పరిదిలో రాజుల ఓట్లకన్నా బలిజల ఓట్లు చాలా ఎక్కువ. కాబట్టి ఎప్పటినుండో అడుగుతున్నారని రాజులకే టికెట్లు ఇస్తారా ? లేకపోతే జనాభా దామాషా ప్రకారం బలిజలకు టికెట్లు ఇవ్వాలని అనుకుంటారా అన్నది సస్పెన్సుగా మారింది. ఏదేమైనా రాజులకే టికెట్లంటే ఏ రాజుకు అన్నది పాయింట్.

  • Related Posts

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు…

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    Spread the love

    Spread the love దర్జాగా కొనసాగుతున్న అక్రమ గృహ నిర్మాణం ఇంటి గుమ్మానికే పరిమితమైన అధికారుల హెచ్చరిక పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన లెక్క చేయని కబ్జాదారులు అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూలై 26 జనసముద్రం న్యూస్ అన్నమయ్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం