
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ఆగస్టు 11 (ప్రతినిధి తుపాకుల రమేష్)
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహలక్ష్మి పథకం అమలులో భాగంగా మూడు రోజుల గడువు నిన్నటితో ముగియడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారని, మరో 30 రోజులు గడువు పెంచాలని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిల్లెల రవి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు గడిచినా పేదవాడికి డబుల్ బెడ్రూం ఇల్లు కలగానే మిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకం గడువు పెంచాలని డిమాండ్ చేశారు.





