
@ ఏజెన్సీలో ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం.
జనసముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్ ,కరకగూడెం, జూలై 15.
సమాజంలోని పేదలకు సేవ చేయాలనే తపన ప్రతీ ఒక్కరిలో రావాలని మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు అభిప్రాయపడ్డారు. కరకగూడెం మండల పరిధిలోని రేగళ్ల ఎంపీపీఎస్ పాఠశాల ఆవరణలో ‘ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్
సికింద్రాబాద్’ ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యులు కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో ఆ పాఠశాల, రేగళ్ల వలస ఆదివాసీ గ్రామ విద్యార్థులతో పాటు అంగన్ వాడీ చిన్నారులతో కలిపి మొత్తం 150 మందికి మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు చేతుల మీదుగా బ్యాగులు,నోట్ పుస్తకాలు,పలకలు డ్రాయింగ్ కిట్స్ ,సోలార్ లైట్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, లక్ష్య సాధనతో కష్టపడి చదివితేనే విజయం సాధించగలరని ఎవ్వరూ కూడా సమయాన్ని వృధా చేయరాదని పేర్కొన్నారు.ప్రాథమిక స్థాయి నుండే లక్ష్యంవైపు అడుగులు వేసే విద్యార్థులకు విజయావకాశాలు ఎక్కువగా దక్కుతాయిని, విద్యార్థి దశ నుంచే ఉన్నత విలువలతో కష్టపడి మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.అంతేకాకుండా
విద్యార్థులు,యువత అనుకున్నది సాధించాలంటే మనస్సును అదుపులో ఉంచి పాఠశాల స్థాయి నుంచే ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని వాటి సాధనకు కృషిచేసి మంచి నైపుణ్యం ద్వారా లక్ష్యం సాధించి, ప్రతిభావంతులుగా నిలవాలని, విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా దృఢ సంకల్పంతో వాటిని అధిగమించి ఆసక్తి ఉన్న రంగాలలో ముందుకు సాగడం ద్వారా మంచి ప్రతిభావంతులు కావచ్చని అన్నారు.ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు.అదేవిధంగా ఏజెన్సీలో ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయంమని పేర్కొన్నారు.
అనంతరం ఫౌండేషన్ సభ్యులు సోందుపాషా మాట్లాడుతూ… ప్రజల అవసరాలను గుర్తించి రానున్న రోజుల్లో పేద ప్రజలకు మరిన్ని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఏడూళ్ళ బయ్యారం సీఐ రాజగోపాల్,కరకగూడెం ఎస్సై రాజారామ్,స్థానిక సర్పంచ్ కుంజ వసంతరావు,రేగళ్ల పాఠశాల హెచ్ఎం నర్సింహరాజు,గ్రామస్థులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





