
జన సముద్రం (డోర్నకల్ డివిజన్ ) టిపిసిసి ఈరోజు అధికారికంగా ప్రకటించిన మండల అధ్యక్షులు ప్రకటనలో రెండవసారి కురవి మండల అధ్యక్షులుగా అంబటి వీరభద్రం ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం చాలా సంతోషమైన విషయం ,
అంబటి వీరభద్రం గారు 2001 నుండి 2006 వరకు ఉమ్మడి కురవి మండల జడ్పిటిసిగా కొనసాగుతూ 2004 నుండి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చురుకుగా పాల్గొని ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నీ వదలకుండా ఆనాటి నుండి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ జెండాను తన భుజస్కందాలపై వేసుకొని కాంగ్రెస్ పార్టీ కష్ట కాలాల్లో ఉన్నా కూడా బలోపేతం చేయడంలో ముందుండి నడిపించిన నాయకుడిగా ఈరోజు వరకు శ్రమించడం జరిగింది అంబటి వీరభద్రం యొక్క నాయకత్వాన్ని గుర్తించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రెండవసారి కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించినందుకు చాలా సంతోషకరమైన విషయం మరియు రాబోయే రోజుల్లో ఇంకా మీ నాయకత్వాన్ని బలపరుస్తూ కురవి మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను ముందుండి నాయకత్వంలో నడిపించాలని కోరుతున్నారు.





