మంటగలుస్తున్న మానవత్వం…ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయిన వారికి ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని కొట్టేయతానికి ఎవరూ గుర్తించని మృత దేహాలను వాడుకుంటున్న కేటుగాళ్లు

Spread the love

నసముద్రం న్యూస్ జూన్ 7:

ఒకపక్క ఒడిశా రైలు ప్రమాదం జరిగి ఆ రైలు ప్రమాదానికి గురైన బాధితులతో పాటు వారి కుటుంబ సభ్యులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోతే మరొక పక్క కేటుగాళ్లు మాత్రం తమ పని తాము కానిస్తున్నారు. నిజానికి ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చనిపోయిన వారికి అలాగే తీవ్రంగా గాయపడిన వారికి నష్టపరిహారం వంటివి ప్రకటిస్తూ ఉంటాయి.

ఈ నేపథ్యంలో వాటిని కొట్టేసేందుకు కేటుగాళ్లు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎవరు గుర్తించని మృతులను తమ కుటుంబ సభ్యులే అని నమ్మించి మృతదేహాలు తీసుకుంటున్నారు. ఆ తరువాత డెత్ సర్టిఫికెట్లు సంపాదించి వారి పేరు మీద నష్ట పరిహారాలు కూడా వెనకేసుకుంటున్నారు. అయితే ఇలా జరుగుతున్న వ్యవహారాన్ని పసిగట్టిన ఒడిశా ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది.
ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇదంతా గీతాంజలి అనే ఒక మహిళ ద్వారా వెళ్లడైంది. ఒరిశాలోని కటక్ కు చెందిన గీతాంజలి దత్త అనే మహిళ ఆదివారం బాలేశ్వర్ లోని మృతుల ఫోటోలు ఉంచిన ప్రదేశానికి వెళ్లి ఈ ప్రమాదం జరిగిన రోజు తన భర్త రైల్లో ప్రయాణిస్తున్నాడని అతని ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదని పోలీసులకు తెలిపింది.

వెంటనే అక్కడున్న ఫోటోలు చూడమని పోలీసులు సూచించడంతో కొన్ని ఫోటోలు చూసిన తర్వాత ఒక వ్యక్తి ఫోటో చూపిస్తూ అతను తన భర్తని చెప్పింది. అయితే ఆమె ప్రవర్తన మీద పోలీసులకు అనుమానం కలగడంతో తమదైన శైలిలో విచారించగా తన భర్త బతికే ఉన్నాడని ఎక్స్ గ్రేషియ కోసమే ఎలా వచ్చానని వెల్లడించింది.దీంతో అవాక్కైన పోలీసులు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మోసాలు కూడా జరిగే అవకాశం ఉందని వెంటనే అలర్ట్ జారీ చేసింది. కేటుగాళ్లు ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదని ఈ పరిణామం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి అన్ని విషయాలను జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యం అని పోలీసులు సూచిస్తున్నారు.

  • Related Posts

    గ్యాంగ్ రేప్.. హత్య.. దేశానికీ సిగ్గు చేటు :అల్లెం కోటి.

    Spread the love

    Spread the loveజన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,మణుగూరు, జూలై 21. మణిపూర్ లో మెజారిటీ వర్గమైనమైతేయిన్ లు, మైనార్టీలైన కుకీ గిరిజనులకు మధ్య హింస పేట్రేగిన మే 3వ తేదీ తర్వాతి రోజే ఈ ఘటన జరిగినట్లు…

    యూనిఫాం సివిల్ కోడ్ యూసీసీ అమలు దిశగా కేంద్రం మరో ముందడుగు..ఇక పై ముస్లింలు ,హిందువులు,ఇతరులు అందరికీ ఒకటే చట్టం..!

    Spread the love

    Spread the loveజనసముద్రం న్యూస్,జూలై 7: ఒక దేశం.. ఒక చట్టం దిశగా మోడీ సర్కారు అడుగులు వేయటం తెలిసిందే. ఒకే దేశంలోని ప్రజలకు మతాల వారీగా చట్టాలు ఉండటం ఏమిటి? అందరికి ఒకే చట్టం ఎందుకు ఉండకూడదన్న వాదనకు తగ్గట్లు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం