మంటగలుస్తున్న మానవత్వం…ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయిన వారికి ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని కొట్టేయతానికి ఎవరూ గుర్తించని మృత దేహాలను వాడుకుంటున్న కేటుగాళ్లు

Spread the love

నసముద్రం న్యూస్ జూన్ 7:

ఒకపక్క ఒడిశా రైలు ప్రమాదం జరిగి ఆ రైలు ప్రమాదానికి గురైన బాధితులతో పాటు వారి కుటుంబ సభ్యులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోతే మరొక పక్క కేటుగాళ్లు మాత్రం తమ పని తాము కానిస్తున్నారు. నిజానికి ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చనిపోయిన వారికి అలాగే తీవ్రంగా గాయపడిన వారికి నష్టపరిహారం వంటివి ప్రకటిస్తూ ఉంటాయి.

ఈ నేపథ్యంలో వాటిని కొట్టేసేందుకు కేటుగాళ్లు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎవరు గుర్తించని మృతులను తమ కుటుంబ సభ్యులే అని నమ్మించి మృతదేహాలు తీసుకుంటున్నారు. ఆ తరువాత డెత్ సర్టిఫికెట్లు సంపాదించి వారి పేరు మీద నష్ట పరిహారాలు కూడా వెనకేసుకుంటున్నారు. అయితే ఇలా జరుగుతున్న వ్యవహారాన్ని పసిగట్టిన ఒడిశా ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది.
ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇదంతా గీతాంజలి అనే ఒక మహిళ ద్వారా వెళ్లడైంది. ఒరిశాలోని కటక్ కు చెందిన గీతాంజలి దత్త అనే మహిళ ఆదివారం బాలేశ్వర్ లోని మృతుల ఫోటోలు ఉంచిన ప్రదేశానికి వెళ్లి ఈ ప్రమాదం జరిగిన రోజు తన భర్త రైల్లో ప్రయాణిస్తున్నాడని అతని ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదని పోలీసులకు తెలిపింది.

వెంటనే అక్కడున్న ఫోటోలు చూడమని పోలీసులు సూచించడంతో కొన్ని ఫోటోలు చూసిన తర్వాత ఒక వ్యక్తి ఫోటో చూపిస్తూ అతను తన భర్తని చెప్పింది. అయితే ఆమె ప్రవర్తన మీద పోలీసులకు అనుమానం కలగడంతో తమదైన శైలిలో విచారించగా తన భర్త బతికే ఉన్నాడని ఎక్స్ గ్రేషియ కోసమే ఎలా వచ్చానని వెల్లడించింది.దీంతో అవాక్కైన పోలీసులు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మోసాలు కూడా జరిగే అవకాశం ఉందని వెంటనే అలర్ట్ జారీ చేసింది. కేటుగాళ్లు ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదని ఈ పరిణామం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి అన్ని విషయాలను జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యం అని పోలీసులు సూచిస్తున్నారు.

  • Related Posts

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    గ్యాంగ్ రేప్.. హత్య.. దేశానికీ సిగ్గు చేటు :అల్లెం కోటి.

    Spread the love

    Spread the loveజన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,మణుగూరు, జూలై 21. మణిపూర్ లో మెజారిటీ వర్గమైనమైతేయిన్ లు, మైనార్టీలైన కుకీ గిరిజనులకు మధ్య హింస పేట్రేగిన మే 3వ తేదీ తర్వాతి రోజే ఈ ఘటన జరిగినట్లు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!