జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్ ,పినపాక, మే 30.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, తోగ్గూడెం పంచాయితీ లోని యువత కి పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువనేత దనసరి సూర్య, సోషల్ మీడియా వారియర్ అచ్చా నవీన్ ఆధ్వర్యంలో వాలీబాల్ కిట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా సూర్య మాట్లాడుతూ ఆటలతో శరీరానికి వ్యాయామం అవుతుందని విద్యార్థులు, యువకులు క్రీడలలో రాణించి భవిష్యత్ కి పునాది వేసుకోవాలని తెలిపారు.ఆటలను దిన చర్యలో ఒక భాగంగా అలవాటు చేసుకోవాలని,యువత ఇతర చెడు మార్గాల వైపు వెళ్లకుండా చదువులు, క్రీడాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని కోరారు.విద్యతో పాటు క్రీడల పట్ల కూడా అసక్తి పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు.అలాగే ఆటలలో రాణించి మీ గ్రామానికి మంచి గుర్తింపు తీసుకురావాలని యువత కి పలు సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓబిసి జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుగొండ సాంబశివరావు,యూత్ నాయకులు బండారు గిరి ప్రసాద్, పినపాక మండల నాయకులు పొనుగోటి చందర్రావు,మణుగూరు మండల నాయకులు పల్లపు సంపత్, రసమళ్ళ నాగరాజు, కొమరం హార్శ తదితరులు పాల్గొన్నారు.





