
మల్కాజ్గిరి కాప్రా జన సముద్రం న్యూస్ మే 30
చర్లపల్లి డివిజన్ పరిధిలోని రైల్వేహార్ కాలనీలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు అధికారులతో కలిసి మార్నింగ్ చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు ముఖ్యంగా కాలనీలో అవుట్లెట్ సమస్యను కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లారు అలాగే పార్కులో పిచ్చి మొక్కలు… అసోసియేషన్ స్థలంలో మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం వంటి పలు అంశాలను కార్పోరేటర్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ యు జీ డి అధికారులతో మాట్లాడి 60 మీటర్ల ఔట్లెట్ నిర్మాణానికి… అలాగే కాలనీ అసోసియేషన్ స్థలంలో మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు..

ఆర్టికల్చర్ అధికారులతో మాట్లాడి పార్కులు పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు. అలాగే డ్రైనేజీ శుభ్రం చేసే అంశంపై కూడా యు జీ డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. కాలనీలో వోల్టేజీ సమస్య… వీధిలైట్ల సమస్యపై ట్రాన్స్కో అధికారులతో మాట్లాడారు. రైల్ విహార్ కాలనీ సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ .. వాటర్ వర్క్స్.. ఎలక్ట్రికల్ విభాగాలకు చెందిన అధికారులు స్వరూప కరుణాకర్ ఉదయ్ నరసింహతో పాటుగా కాలనీ అధ్యక్షులు బి ప్రభాకర్, జనరల్ సెక్రెటరీ ముత్తు మారన్, కాలనీవాసులు హనుమంతు నాయక్ ,జయతి డివిజన్ బి ఆర్ ఎస్ నాయకులు బాల్ రెడ్డి ,ప్రభు గౌడ్, ధనుంజయ్ గౌడ్, మురళి గౌడ్ ,సదానంద్, తదితరులు తదితరులు పాల్గొన్నారు.





