
పుల్లల చెరువు,మే 19 జనసముద్రం న్యూస్:
మండలకేంద్రమైన పుల్లల చెరువులో జగనన్న ఇళ్లను వెంటనే ప్రారంభించాలని ఎంపిడివో రాజ్యలక్ష్మి అన్నారు. స్థానిక ఎంపిడివో కార్యాలయంలో జగనన్న లేఅవుట్1,2 లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎంపిడివో రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, ఇల్లుకట్టుకొనేవారు ఎవరైనా ఉంటే హోసింగ్ అధికారులను సంప్రదించి వెంటనే శంకుస్థాపన హోసింగ్ అధికారులువరిజిస్ట్రేషన్ చేసిమ్యాపింగ్ చేస్తారన్నారు. లే అవుట్ 1లో10 మంది,లే అవుట్2లో11 మంది ఇళ్ళు కట్టుకోవడానికి ముందుకొచ్చారన్నారు.ఈ సందర్భంగా హోసింగ్ ఎయి మాట్లాడుతూ,బేస్మెంట్ కు 70 వేల నగదు,4 కట్టల సిమెంట్, పిల్లర్లు వేసుకొంటే మూడు ట్రక్కుల ఇసుక ఇవ్వడం జరుగుతుందన్నారు.రూప్ లెవెలకు ముప్పై కట్టల సిమెంట్,ఒక ట్రిప్కు ఇసుక,నలభైవేల నగదు,142 కేజీల స్టీల్, శ్లాబుకు 20 కట్టల సిమెంట్,142 కేజీల స్టీల్,20 నుండి 30 వేల నగదు ఇస్తారని ఆయన తెలిపారు.మొత్తంమీద ఒక్కొక్క ఇంటికి 90 సిమెంట్ కట్టలు, 440 లేజీల స్టీల్ 4 త్రిప్పుల ఇసుక,ఇవన్నీ పోను నగదు,ఉపాధిహామీలో 30వేల నగదు ఇవ్వడం జరుగుతుందన్నారు.పొదుపు కట్టే మహిళ లుంటే ఒక్కొక్క మహిళకు వెలుగు పధకం ద్వారా 35 వేల రూపాయల రుణం ఇస్తారన్నారు.ఇల్లు కట్టుకునే వారు వెంటనే ఫౌండేషన్ వేయాలన్నారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కె.జానకి రఘు, ఈవోఆర్డీ బాలునాయక్,హోసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ ఐసిడిఎస్ సూపర్వైజర్ శివలక్ష్మి,వెలుగు ఏపీఎం నూనె.వెంకటయ్య,విఆర్వో వెంకటసుబ్బయ్య, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు,వాలంటీర్లు,లబ్ధిదారులు పాల్గొన్నారు.





