
రాష్ట్ర ముఖ్యమంత్రి ” వి ఆర్ ఎ” ల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అవి నెరవేరుతాయా..?
జన సముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మే 12:
అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు పే స్కేల్ జీవో, వారసత్వ ఉద్యోగాలు, ప్రమోషన్లు తదితర హామీలు నెరవేర్చకపోవడంతో దామరచర్ల మండల “విఆర్ ఏ” జేఏసీ ఆధ్వర్యంలో.. స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసిల్దార్ గణేష్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వి ఆర్ ఏ జేఏసీ జిల్లా కో చైర్మన్ పల్లా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ..
మునుగోడు ఉప ఎన్నికల ముందు “వి ఆర్ ఏ ల ” సమస్యలు పరిష్కరిస్తామని సమ్మె విరమింపజేసి పలుమార్లు కేటీఆర్ వి ఆర్ఏ ప్రతినిధులతో చర్చలు జరిపి హామీ ఇచ్చిన అవి నేటికి నెరవేరలేదని మండిపడ్డారు. 80 రోజుల సమ్మె కాల వేతనం ఇవ్వకపోగా 80 మంది “వి ఆర్ ఏ” లు మృతి చెందిన ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే పే స్కేల్ జీవో విడుదల చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి ఆర్ ఏ జేఏసీ జిల్లా కో కన్వీనర్ బొజ్జ లక్ష్మీ శ్రీనివాస్, షేక్ జానీ బాషా, బెజ్జం కళ్యాణ్, గండెల రామచంద్రయ్య, నాగిరెడ్డి లక్ష్మి జనార్ధన్, చెన్నబోయిన నాగయ్య, విజయ్ కుమార్, కోట బాలకృష్ణ తదితర “వి ఆర్ ఏలు” పాల్గొని తమ ఆవేదనను వ్యక్తపరిచారు.





