
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మే 10
ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. ఈరోజు ఆయన భువనగిరి జోన్ లోని బోనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. అనంతరం ఫిర్యాదుదారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఈ కమిషనరేట్ పరిధిలోని ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. సివిల్ వివాదాలకు పోలీసులు దూరంగా ఉంటారన్నారు. అలాంటి వాటిని కోర్టుల్లో పరిష్కరించుకోవాలని ఫిర్యాదుదారులకు సూచించారు. నేరాలకు పాల్పడి ఇతర రాష్ట్రాలకు పారిపోతున్న వారిని పట్టుకొని చట్టం ముందు నిలబెడుతున్నామని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమావేశమయ్యారు.
అనంతరం డిసిపి ఆఫీస్ లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో యదాద్రి భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర ఐపీఎస్, ఏసిపి వెంకట్ రెడ్డి, భువనగిరి టౌన్ సీఐ, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు






