
మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి మే 10: తుపాకుల రమేష్
బ్యాంకు నుండి రుణాలు తీసుకునేందుకు ఎటువంటి అర్హత లేకుండా తమ ఫౌండేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తానని మొహం చాటేసింది ఓ మహిళ ఈ విషయమై బుధవారం పలువురు బాధిత మహిళలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా పరకాలకు చెందిన క్రాంతి జ్యోతి ఫౌండేషన్ నిర్వాహకులు రజనీ రుద్రమ ఒక్కొక్కరి నుండి 18 వేల నుండి 20వేల వరకు సుమారు ఏడు లక్షలు వసూలు చేసి రుణాలు ఇప్పించమంటే తమకు అందుబాటులోకి రావడం లేదని వాపోయారు. తాను ఇప్పించే రుణాలతో (ఎం ఎస్ ఎం ఈ) అక్కుర పరిశ్రమలకు రుణాలు ఉపయోగపడతాయని నమ్మించిందన్నారు. ఈ విషయమై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని అధికారులు తగు చర్యలు తీసుకుని నిరుపేద కుటుంబాలకు చెందిన తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బాధితులు మంజుల, శ్వేత, ఆనంద్, భారతి తదితరులు పాల్గొన్నారు.





