
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, మణుగూరు,మే 4.
- పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలి గులాబీ నాయకులకు పిలుపు.
- పినపాక నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, సమితి సింగారం గ్రామపంచాయతీలోని పద్మశాలి భవన్ నందు పినపాక నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గులాబి యువ సైన్యం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో బి ఆర్ ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పడం ఖాయమన్నారు.పినపాక నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతున్నదని భవిష్యత్ రాజకీయాలలో యువత కీలక పాత్ర పోషించాలి అన్నారు.సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వివిధ రంగాలలో ఉన్న యువత ఒకే తాటి పైకి వచ్చే విధంగా కృషి చేయాలన్నారు.పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు పట్టుదలతో పని చేయాలన్నారు, యువత చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని సూచించారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు.పార్టీ విజయం కోసం పనిచేయాలని రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నదని, దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు.ఎన్నికల సమయంలో కార్యకర్తలు జాగ్రత్తగా వ్యవహరించి పార్టీ విజయానికి కృషి చేయాలి అన్నారు. ఎన్నికలను ప్రతిష్మాత్మకంగా తీసుకొనే సమయం ఆసన్నమైంది అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





