
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఏప్రిల్ 28:
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కేఎల్ఎన్ జూనియర్ కళాశాలలో మోడల్ ఎంసెట్ పరీక్ష నిర్వహించడం జరిగింది.ఎంసెట్ ప్రశ్నాపత్రాలు
మాజీ శాసనసభ్యులు
జూలకంటి రంగారెడ్డి విడుదల చేసి అనంతరం
విద్యార్థులనుద్ధెశించి మాట్లాడుతూ…
విద్యార్థులు ఇలాంటి ప్రతిభా పరీక్షలను బాగా రాయాలని కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ఎంసెట్ పరీక్ష లో మంచి ఫలితాలు వస్తే మంచి కళాశాలలో ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వస్తుందని అన్నారు.విద్యార్థుల తల్లి దండ్రులు… మీ మీద ఎంతో ఆశలతో… మంచి ర్యాంకు లు వస్తాయాని ఎదురు చూస్తూ వున్నారు. అందుకే మీరందరు బాగా కష్టపడి చదవాలని అన్నారు.పాలక ప్రభుత్వాన్ని విద్యార్థుల తరుపున డిమాండ్ చేస్తూ… పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎంతగానో డబ్బులు ఖర్చు చేసి చదువుకుంటుంటే ప్రశ్న పత్రాలు లికేజి సమస్య మిందరిని వేంటాడుతుందనీ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి పోటి పరీక్షలు, ఇతర పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు కృషి చేసే విధంగా భారత విద్యార్థి ఫెడరేషన్ “ఎస్ఎఫ్ఐ” విద్యార్థులు పోరాడుతారని హమి ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మా జీ మున్సిపల్ వైస్ చైర్మన్ డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి వేంకటేశ్వర్లు, కే ఎల్ ఎన్ జూనియర్ కళాశాల నరేందర్ రెడ్డి, కిరణ్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మూడవత్ రవి నాయక్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, మిర్యాలగూడ డివిజన్ కార్యదర్శి కోర్ర సైదా నాయక్, మిర్యాలగూడ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వదూద్, మూడవత్ జగన్ నాయక్, సమ్మద్, ఆకాష్, ఉపేందర్, రవి, సాయి,అఖిల్ తదితరులు పాల్గొన్నారు.





