
సిఐటియు పిలుపుమేరకు చెవిలో పూలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేసిన బైరం దయానంద్…
జనసముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఏప్రిల్ 21:
ఈరోజు దామరచర్ల మండల కేంద్రంలో 5వ రోజు సమ్మెలో పాల్గొన్న వివో ఏలు.
ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి దయానంద్ మాట్లాడుతూ..
సిఐటియు పిలుపుమేరకు… చెవిలో పూలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది.వీరి న్యాయమైన కోరికలను వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో ఇంకా అనేక రకాల నిరసనలు చేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వివో ఎలా సంఘం అధ్యక్ష కార్యదర్శులు పి సునీత, అజయ్, ఉమా, శ్రీదేవి, రమణ, తదితరులు పాల్గొన్నారు.





