
- సంస్థ ఐడి కార్డు ఉన్న జర్నలిస్ట్ కాదా….?
- సర్టిఫికెట్ కే పరిమితమా …?
- *దళిత జర్నలిస్టు ఆవేదన..?
- *గ్రామీణ ప్రాంతాల జర్నలిస్టులకు చుక్కెదురు..?
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఎర్ర.పురుషోత్తం ఏప్రిల్ :21
అక్రిడేషన్ కార్డు ఉంటేనే జర్నలిష్ట ? సంస్థ ఐడి కార్డు ఉంటే జర్నలిస్ట్ కాదా …అని మెదక్ జిల్లా కొల్చారం మండలానికి చెందిన ఒక దినపత్రికకు చెందిన దళిత జర్నలిస్టు తన ఆవేదనను తెలిపారు. గత 2022 మార్చి మాసంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రవేశపెట్టిన మూడు రోజులు దళిత జర్నలిస్టుల శిక్షణ తరగతులకు మెదక్ జిల్లాకు చెందిన కొంతమంది జర్నలిస్టులు హాజరైన, దళిత జర్నలిస్టు సర్టిఫికెట్లను కూడా జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చేతుల మీదుగా అందుకున్నామని కొల్చారం మండలానికి చెందిన దళిత జర్నలిస్టు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన జర్నలిస్టుల ఇంటి స్థలాలలో విషయంలో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకి ఇంటి స్థలాలు ఇవ్వాలని, లేని పక్షంలో దళిత జర్నలిస్టుల సమక్షంలో ఆందోళన చేపడుతామని ఆవేదన వ్యక్తం చేశారు. 2022 గత మార్చి సంవత్సరంలో జరిగిన దళిత జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ శిక్షణ కార్యక్రమానికి కూడా హాజరైన విషయం అందరికి తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల జర్నలిస్టులకు జరుగుతున్న ఇంటి స్థలాల విషయంలో అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు స్పందించి కొల్చారం మండలంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని వివిధ దినపత్రికలకు చెందిన జర్నలిస్టులు వారి ఆవేదన వ్యక్తం చేశారు
- స్థానిక ఎమ్మెల్యే హామీ…. మెదక్ జిల్లా కొల్చారం వివిధ దినపత్రికలకు చెందిన విలేకరులు ఇంటి స్థలాల విషయంలో స్థానిక నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కలిశారు. ఎమ్మెల్యే స్పందించి కొల్చారం మండలంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్టులకు తప్పకుండా ఇంటి స్థలాలు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు.
- ఎమ్మెల్యే హామిని తుంగలో తొక్కిన అధికారులు…. స్థానిక ఎమ్మెల్యే నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సంబంధిత అధికారులకు జారీ చేసినప్పటికీ , అధికారులు ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, ప్రజల సమస్యలపై కథనాలు రాస్తున్న పత్రికా విలేకరులను గుర్తించి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇవ్వాలని వారి ఆవేదన వ్యక్తం చేశారు .





