
జన సముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఏప్రిల్ 14:
ఈరోజు దామరచర్ల మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ, సిఐటియు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 132వ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగినది.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మాలోతు వినోద్ నాయక్ అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాల పూలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఎర్ర నామం కాలనిలో కార్మిక వాడలో కార్మికులందరితో కలిసి బైరం దయానంద్ అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాల పూలు వేసి నివాళులర్పించి… అంబెడ్కర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ..
సామాజిక న్యాయం కోసం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి అంబేడ్కర్ మహానుభావుడు రాజ్యాంగం రాసిన… ప్రతిఫలంగానే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న … 125 అడుగుల విగ్రహం…. దేశానికి ఆదర్శంగా నిలవనున్న అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఈ రోజున హైదరాబాద్ నడిబొడ్డున ఆవిష్కరించబోతోంది.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన రాజ్యాంగం విధానాన్ని తీసుకురావాలని తెలిపి కొన్ని రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారు. రాజ్యాంగాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలను ….పాలకవర్గం ఇటు కేంద్రం ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని వ్యతిరేకించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపి, రవి, పిచ్చయ్య , మేశ్యా, పవన్… లు.కుంచాల శివ, లక్ష్మయ్య, సైదులు,రాజేష్, జఫ్ఫార్, ఎస్.కె సుభాని , భాష, కాలనీ ప్రజలుతదితరులు పాల్గొన్నారు.





