
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, కరకగూడెం, ఏప్రిల్ 14.
ప్రపంచ మేధావి,నవభారత నిర్మాత,బహుముఖ ప్రజ్ఞాశాలిగా అణగారిన పేద,బడుగు,బలహీన వర్గాల క్షేమం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని టిపిసిసి సభ్యులు డాక్టర్ చంద సంతోష్ కుమార్ అన్నారు. అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో టిపిసిసి సభ్యులు డాక్టర్ చందా సంతోష్ కుమార్, మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ చందా సంతోష్ కుమార్ మాట్లాడుతూ అత్యంత మేధోసంపత్తితో భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని ,అణగారిన వర్గాల కోసం జీవితాంతం పరితపించి వారి జీవితాల్లో సామాజిక విప్లవ స్ఫూర్తి నింపిన ప్రదాత అంబేద్కర్ అని పేర్కొన్నారు.స్వాతంత్ర భారత దేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కులాలకు,మతాలకు అతీతంగా ప్రజలందరూ సుఖ జీవనం గడపాలని ఆశించి భావితరాలకు సమ సమాజాన్ని అందించాలని కాంక్షతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని,
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.అనంతరం పంచాయతీ కార్మికుల యొక్క సేవలను అభినందించి శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ జనరల్ సెక్రెటరీ మిట్టపల్లి నితిన్ , మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు , మండల మహిళా అధ్యక్షురాలు చందా వెంకట రత్నమ్మ , మండల ప్రధాన కార్యదర్శి చందా నాగేశ్వరరావు , మండల నాయకులు చెన్నూరి రవీంద్ర , గోగు కిరణ్ కుమార్ , కొండ గొర్ల సమ్మయ్య , గాంధర్ల నరేష్ , చెన్నూరి నరసింహారావు ,చెన్నూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.





