
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్ ,పినపాక, ఏప్రిల్ 14.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,పినపాక మండలం లో
అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని ఉప్పాక గ్రామంలో గల భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నేతకాని సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రపంచ మేధావి ,భారత దేశ దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని వక్తలు కొనియాడారు. యుగాలు మారినా తరాలు మారినా అంబేద్కర్ లాంటి మహానీయుడు మళ్లీ జన్మించబోడని, భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా చదివి జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కులమతాలకు అతీతంగా ప్రతి పౌరుడు సమ గౌరవంతో సమాన హక్కుల్ని పొందేలా రాజ్యాంగాన్ని రూపొందించారని, భిన్న సంస్కృతులు, భిన్న మతాలకు అవకాశాలను కల్పించిన ఈ భారత దేశంలో ప్రజలందరి ఆదరణను, నమ్మకాన్ని చూరగొన్న రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప మహనీయుడు అని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూనెం సుజాత, ఉప సర్పంచ్ గుంటుపల్లి రామారావు, నేతకాని సంఘం నాయకులు జిమ్మిడి శివశంకర్, గుమాస్ గోవర్ధన్ ,జాడి రాంబాబు , సుమన్ నరసింహారావు కన్నయ్య శ్రీనివాస్ , బోడ లక్ష్మణ్ రావ్,గద్దల సమ్మయ్య, రామచంద్రం, సుమలత, రాణి, సంపత్, గ్రామస్తులు తదితర నాయకులు పాల్గొన్నారు.





