
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఏప్రిల్ 11:
సమ సమాజ స్థాపన కొరకు జీవితాంతం కృషి చేసిన మహాత్మ జ్యోతి రావు ఫులే జీవితం స్ఫూర్తి దాయక మని మిర్యాలగూడ
శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు,మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ అన్నారు. దళిత సంఘాల ఐక్యవేదిక మిర్యాలగూడ ఆధ్వర్యంలో…. మహాత్మ జ్యోతిరావు ఫూలే 197 వ జయంతి ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ…
జ్యోతిరావు పూలే భారత సామాజిక వ్యవస్థ పరిణామానికి దృవతార అని అన్నారు. అట్టడుగున నిలిచిన పునాది వర్గాలను జాగృతం చేసి , వారి బానిస సంకెళ్లను తెంచడానికి జీవితాన్ని అంకితం చేసిన బహుజన సంస్కర్త పూలే అని అన్నారు. గాంధీజీ కంటే ముందే మహాత్మునిగా గుర్తింపును పొందాడని తెలిపారు పూలే ఆశయ సాధన కొరకు ప్రజలందరూ…కృషి చేయాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో జ్యోతిరావు ఫూలే ఉత్సవ కమిటీ కన్వీనర్ నల్లగంతుల నాగభూషణం, తిరుమలగిరి, అంజి, ముళ్లగిరి కాంతయ్య, డాక్టర్ రాజు, మారం శ్రీనివాస్ , రాపోల్ పరమేష్, తలకొప్పుల సైదులు, పోలగోని వెంకటేష్, గుండు శ్రీరాములు, మురళి యాదవ్, కాశీ, గోపి, తిరుమలగిరి అశోక్, వసుకుల సైదమ్మ,తదితరులు పాల్గొన్నారు






