
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఏప్రిల్ 11:
మిర్యాలగూడ పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా… 2023 సంవత్సరం బుధవారం ఏప్రిల్ 12న “వాసవి క్లబ్ ” ఆధ్వర్యంలో “ఆర్టీసీ డిపో ” సహాయ సహకారంతో దివ్యాంగులకు ఉచిత బస్సు పాస్ మేళా నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమము ఉదయం 8. 00 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు నిర్వహించబడును. దివ్యాంగులందరూ… సదరం సర్టిఫికెట్,ఆధార్ కార్డు జిరాక్స్, మరియు పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని వచ్చి వాసవి క్లబ్…, ఆర్టీసీ డిపో సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమము ద్వారా మీరు ఉచిత బస్సు పాసులను పొందగలరని బి. పాల్ తెలిపారు.





