
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్, ఏప్రిల్ 7 :
రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ అధ్యర్యంలో పదవ తరగతి పరీక్షలు చాలా పకడ్బందీగా జరుగుతున్నాయని, విద్యార్థులు ఎటువంటి భయాందోళనాలకు గురికావాల్సిన అవసరం లేదని, ధైర్యంగా పరీక్షలు వ్రాసి గ్రేడింగ్ సాధించాలని బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాలోత్ దశరత్ నాయక్ కోరారు.
శుక్రవారం విలేఖర్లతో మాట్లాడుతూ..
పరీక్షలు ప్రారంభం…దగ్గర నుంచి ప్రతిరోజూ పేపర్ లీక్ పేర్లతో వార్తలు వస్తుండడంతో…అసలు పరీక్షలు జరుగుతాయా?, వాయిదా పడతాయా? అని ప్రతిరోజూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనలకు గురవుతున్నారని తెలిపారు. మరో వైపు విద్యార్థులు పరీక్షలకు భయంతో సరిగా సిద్ధం కాలేకపోతున్నారని అయన అన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో పరీక్షలు పక్కడ్బందీగా జరుగుతున్నాయని ఎటువంటి రాజకీయ జోక్యం పరీక్షలలో అవసరం లేదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలు పరీక్షలకు సిద్ధం అయ్యేలా చూసుకోవాలని పరీక్షలపై దైర్యం కల్పించాలని కోరారు.ఇప్పటికి మూడు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని మిగిలిన మూడు పరీక్షలు అలానే జరుగుతాయని అన్నారు. బంజారా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పరీక్షలపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.చిన్న పిల్లల పరీక్షలపై ఎవరైన రాజకీయం చేయడం తగదన్నారు. దీంతో విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. పరీక్షలు ప్రశాంతంగా విద్యార్థులు రాసుకునేలా అందరూ సహకరించాలని కోరారు.





