
మిర్యాలగూడ కు రానున్న వందేమాతరం ఎక్స్ ప్రెస్ రైల్ కు పట్టణ, గ్రామాల ప్రజలందరూ… స్వాగతం పలకాలన్న బిజెపి శ్రేణులు..
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఏప్రిల్ 7 :
భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా 2023 సంవత్సరం ఏప్రిల్ 8న సికింద్రాబాద్- తిరుపతి కు బయలుదేరే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఉదయము పది నుంచి 11 గంటల సమయంలో సికింద్రాబాద్ లొ ప్రారంభిస్తారు. అనంతరం మిర్యాలగూడకు 12 నుంచి రెండు గంటల వరకు మిర్యాలగూడ రైల్వే స్టేషన్ వద్ద ఈ రైలు “ఐదు నిమిషాల వరకు ఫ్లాట్ ఫాంపై ” ఆగుతుంది .ఈ రైలు ద్వారా మిర్యాలగూడ పట్టణ ప్రాంత , గ్రామాల ప్రజలకు… తిరుపతి, ఈ మార్గమధ్యమున తదితర ప్రాంతాలకు వెళ్ళుటకు… అధునాతనమైన సౌకర్యాలతో,అతి తక్కువ సమయంలో ప్రయాణికులు గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు.ఈ రైలు ప్రారంభించినందుకు భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి బిజెపి శ్రేణులందరూ… ధన్యవాదాలుతెలిపారు. ఏప్రిల్ 8న వస్తున్న ఈ రైలు కు స్వాగతం పలుకుటకు మిర్యాలగూడ రైల్వే స్టేషన్ నందు ఈ ప్రాంత ప్రజలు, వివిధ సంఘాల నాయకులు,…. రైల్వే స్టేషన్ వచ్చి స్వాగతం పలకాలని కోరుకుంటున్నామని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు సాదినేని శ్రీనివాసరావు,అసెంబ్లీ కన్వీనర్ రతన్ సింగ్ నాయక్, కనపర్తి సత్యప్రసాద్,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు శిత్రామ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు దొండపాడు వెంకటరెడ్డి,పట్టణ ప్రధాన కార్యదర్శి చిలుకూరి శ్యామ్, తదితరులు పాల్గొని ఈ కార్యక్రమము కు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జరిగే విధంగా పరిశీలించడం జరిగింది.






