
- బిజెపి ప్రభుత్వం పై మండిపడ్డ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక, ఏప్రిల్ 5.
విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతుందని టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు బుధవారం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అబాసపాలు చేయడానికి బిజెపి అగ్ర నాయకత్వం చేసిన కుట్రలో భాగంగానే ఈ పేపర్ లీకేజీలనే అనుమానాలు బలపడుతున్నాయన్నారు. విద్యార్థులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం దివాలా కోరు రాజకీయ విధానాలకు నిదర్శమని విమర్శించారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేసి ప్రభుత్వం పై దుమ్మెత్తి పోయడం రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని ,ఈ విషయంలో వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నారని ఆరోపించారు .చిల్లర రాజకీయాలు చేస్తున్న బిజెపి పార్టీలకు రానున్న ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, సహకార సంఘం చైర్మన్ రవి శేఖర్ వర్మ, వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాట్ల వాసు బాబు, భవాని శంకర్, రైతు సంఘం నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మొగులపల్లి నరసింహారావు, ఎంపీటీసీలు కాయం శేఖర్, చింతపంటి సత్యం, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





