
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఏప్రిల్ 5:
భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి,స్వాతంత్ర సమరయోధుడు, దళిత వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన బాబు జగ్జీవన్ రాం ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాలోతు దశరధ నాయక్, యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగోండి మురళి యాదవ్, సామాజికవేత్త జ్వాల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జగ్జీవన్ రాం జయంతిని పురస్కరించుకుని బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని మాస్టర్ మైండ్ పాఠశాల, వై జంక్షన్, మహిముద్ టీ స్టాల్ వద్ద జరిగిన జయంతి ఉత్సవాల్లో వారు పాల్గొని పూల మాల, పూలువేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ…

పేద వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆయన సూచించిన మార్గంలో దళిత వర్గాలు నడవాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సైదులు, పాపయ్య,నాగయ్య,రూప, సామాజిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరాజు జయరాజు, ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు ఇస్లావత్ సైదా నాయక్, శ్రీను, జిల్లా వెంకటేశ్వర్లు, గౌస్ బాషా, తదితరులు పాల్గొన్నారు





