
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఏప్రిల్ 5 :
‘తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్’ ఛైర్మన్ గా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియమించడం పట్ల బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను లింగంగౌడ్ హైదరాబాద్ లోని… నివాసంలో కలిసి అభినందించారు.
ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు… మరిన్ని పదవులు రాజకీయాలలో అవకాశాలు కల్పించాలని కోరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ యువతకు ఎక్కువ అవకాశాలు కల్పించి, రాజకీయాల పట్ల ఆసక్తి చూపే యువతను ప్రోత్సహించాలని కోరారు.





