
మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: ఏప్రిల్ 04
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టు కాంప్లెక్స్ బార్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెలే కి కోర్టు బిల్డింగ్ నిర్మాణానికి ఎదురవుతున్న అడ్డంకులను కమిటీ సభ్యులు వివరించారు. దీనికి ఎమ్మెల్యే స్పందించి సాధ్యమైనంత తొందరగ ముఖ్యమంత్రి ని కలిసి ఆయనకు పరిస్థితులను వివరించి తన శక్తి మేరకు బిల్డింగ్ నిర్మాణానికీ కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు,
ప్రెసిడెంట్ కోటా రామచంద్రారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ తుమ్మ కిరీట్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రాజు యాదవ్, జాయింట్ సెక్రెటరీ బాపిరెడ్డి,
మాజీ ప్రెసిడెంట్ యాదగిరిరావు, అబ్బా రమేష్ లక్ష్మీనరసయ్య, కొంపెల్లీ మునిసిపాలిటీ స్టాండింగ్ కమిటీ సభ్యులు సిహెచ్ కృష్ణ, పెంచల సురేందర్రావు, సీనియర్ న్యాయవాదులు లక్ష్మీనరసింహం, మరియు
లేడీ రిప్రజెంటేటివ్ కవిత, ట్రెజరర్ రంజిత, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ సునీత రాజ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు భరత్ కుమార్ ధనుజ తదితరులు ఉన్నారు.






