
మల్కాజ్గిరి జనసభందరం న్యూస్ ప్రతినిధి మార్చ్ 31
త్వరలో జరుగనున్న హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని రాచకొండ కమిషనర్ డి ఎస్ చౌహాన్ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. ఎల్బి నగర్ లోని కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హనుమాన్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులకు కమిషనర్ పలు సూచనలు చేశారు. శాంతియుతంగా ఊరేగింపులు జరుపుకోవాలని, పోలీసులతో సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. రాచకొండ పరిధిలోని సున్నితమైన ప్రదేశాలలో ఉత్సవాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తులు, ప్రజలు సంతోషంగా, శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలని, పోలీసులకు సహకరించాలని కమిషనర్ కోరారు. ఈ సమావేశంలో ఎల్ బి నగర్ ఏసిపి శ్రీధర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ అంజి రెడ్డి, హనుమాన్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు శివరాం, శశిధర్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.






