
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, మణుగూరు, మార్చి 28.
టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ,డిసిసి అధ్యక్షులు పొదెం వీరయ్య ఆదేశాల మేరకు మణుగూరు మండల కేంద్రంలో మండల అధ్యక్షులు పీరీనాకి నవీన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దును వ్యతిరేకిస్తూ సంకల్ప సత్యాగ్రహ దీక్షను చేపట్టిన టిపిసిసి సభ్యులు డాక్టర్.చందా సంతోష్ కుమార్, పినపాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కాటిబోయిన నాగేశ్వరరావు సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులకు పూలమాలలను మాజీ జడ్పీ చైర్మన్, ఎక్స్ ఎమ్మెల్యే చందా లింగయ్య వేసి ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ దేశ ఐక్యత,ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు “భారత్ జోడో యాత్ర” చేపట్టడంతో వచ్చిన ప్రజా ఆమోదాన్ని జీర్ణించుకోలేక వయనాడ్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం అనేది బిజెపి చేస్తున్న కుట్ర అని అన్నారు.ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మోడీ నుండి ఈ దేశాన్ని రక్షించేందుకు రాహుల్ గాంధీ నిరంతరం పోరాటం చేస్తారన్నారు.రాహుల్ గాంధీ పై వేసిన అనర్హత వేటు రాజ్యాంగాన్ని దుర్వినియోగపరచడమే అని,రాహుల్ గాంధీ పార్లమెంట్ అనర్హత వేటు ను తిరిగి వెనుకకు తీసుకొని యెడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు,పోరాటాలు చేస్తూనే ఉంటామని తెలిపారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన మణుగూరు మండలంలో చేపట్టిన సంకల్ప సత్యాగ్రహ దీక్షకు సిపిఐ ,టిడిపి, వైయస్సార్ టి పి తో పాటు పలు రాజకీయ పార్టీలు, తుడుం దెబ్బ నాయకులు తమ సంఘీభావాన్ని తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం సుధాకర్ రెడ్డి , సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి ,ఆవుల సర్వేశ్వరరావు ,కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ,పినపాక మండల అధ్యక్షులు గొడిశాల రామనాధం,అశ్వాపురం మండల అధ్యక్షులు ఓరుగంటి బీక్షమయ్య ,బీ బ్లాక్ అధ్యక్షురాలు బర్ల నాగమణి ,కరకగూడెం మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్, నియోజకవర్గ మహిళా నాయకురాల్లు బోగినేని వరలక్ష్మి, గొంది రాధ ,నియోజకవర్గ , మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





