
ఏ.ఐ.ఎస్.ఏ నగర ఇంచార్జ్ మంజునాథ్.
జన సముద్రం న్యూస్, మార్చి 23, అనంతపురం.
నేడు భగత్ సింగ్ 92వ వర్ధంతి సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్, నాయకులు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ నగర ఇంచార్జ్ మంజునాథ్ మాట్లాడుతూ భగత్ సింగ్ దేశం గర్వించదగ్గ గొప్ప దేశభక్తుడుని ధైర్యసాహసాలకు భగత్ సింగ్ నిలువెత్తు నిదర్శనం చెప్పవచ్చు అని యువతలో స్వాతంత్ర్య స్ఫూర్తిని తగిలించడం భగత్ సింగ్ ముఖ్య పాత్ర పోషించాలని తెలిపారు. ఆయన ఇచ్చిన ఇంక్వాలాబ్ జిందాబాద్ అనే నినాదం యువతను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు. భారతమాత స్వేచ్ఛ కోసం 23 ఏళ్ళకే ఉరికంబం ఎక్కి ప్రాణ త్యాగం చేసిన విప్లవ యోధుడు భగత్ సింగ్ అన్నారు. నన్ను చంపొచ్చు గాని నా ఆశయాలను నా ఆదర్శాలను చంపలేదని. తెలిసిన వీరుడు. వీరి త్యాగం మా ఆనందమయ జీవితానికి సోపానంమీ బలిదానం మరువదు ఈ దేశం. పరాయి పాలన నుండి దేశ విముక్తి కొరకు అతి చిన్న వయసులోనే ప్రాణాలను తృణప్రాయంగా విడిచిన యువ వీరులు, భారతమాత ప్రియ పుత్రులు భగత్ సింగ్,రాజ్ గురు, సుఖ్ దేవ్ లను సంస్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నవీన్, మహేంద్ర మహేష్, తదితులు పాల్గొన్నారు.





