
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక, మార్చి 21.
సంఘవిద్రోహ శక్తులకు సహకరించరాదని ఏడుల్ల బయ్యారం ఎస్సై నాగుల్ మీరా ఖాన్ అన్నారు. మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామాలైన ఎర్రగుంట, సుందరయ్య నగర్ ఆదివాసి గ్రామాలలో పోలిసింగ్ లో భాగంగ చిరు వ్యాపారులను, యువకులను కలిసి వారి మంచి చెడ్డలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఏజెన్సీలోని ఆదివాసీలు యువత బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రభుత్వ, పోలీస్ శాఖ , వివిధ శాఖలలో ఉపాధి,ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అయ్యాయని ఆదివాసి గిరిజన యువత అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగుపడాలన్నారు.కాలం చెల్లిన సాంప్రదాయాలతో మావోయిస్టు పార్టీ ఏజెన్సీ అభివృద్ధికి ఆటంకంగా మారిందని ఎట్టి పరిస్థితిలోనూ మావోయిస్టు పార్టీలకు విప్లవ గ్రూపుల కైనా సహకరించొద్దని, సహకరిస్తే ఎంతటి వారైనా చట్టరీత్యా శిక్షార్హులౌతారని, జీవితాలు ఆగమైపోతాయని తెలిపారు.ఏజెన్సీలోని ఆదివాసీలకు ఎలాంటి అవసరాలైన పోలీస్ శాఖ నుండి ఎల్లప్పుడు సహాయ సహకారాలు అందుతాయన్నారు. మీకు ఇలాంటి సమస్యలున్న మా దృష్టికి తీసుకువస్తే వివిధ శాఖల అధికారులతో సమన్వయపరిచి మీకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ దిలీప్ కుమార్,పోలీస్ సిబ్బంది, టీఎస్పీఎస్సీ సిబ్బంది పాల్గొన్నారు.





